ఇరాన్లో బుధవారం జరిగిన భారీ పేలుళ్లలో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 170మంది గాయపడ్డారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన ఖుద్స్ ఫోర్స్కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమాని సంస్మరణ సభలో ఈ దుర్ఘటన జరిగింది. ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బబక్ యకపరస్ మాట్లాడుతూ.. గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.