Saturday, April 27, 2024

దారుణం.. ఎనిమిది రోజుల పసిబిడ్డను చంపిన తండ్రి..!!

spot_img

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డను తండ్రే చంపాడు.  ఆశా కార్యకర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read.. అనంత్‌నాగ్‌లో మరో సైనికుడు వీరమరణం..ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కొనసాగుతోన్న ఎన్‏కౌంటర్..!!

వివరాల్లోకి వెళ్తే.. పహూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల హరినగర్‌ తండాలో గోకుల్‌ జాదవ్‌ (30) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. జాదవ్‌ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలుండగా.. తాజాగా మూడో కాన్పులో కూడా ఆడబిడ్డే పుట్టింది.

Also Read.. విషాదం..ఒకేరోజు ఇద్దరు భార్యల మృతి.. శోకసంద్రంలో భర్త..!!

దీంతో జాదవ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యంత దారుణంగా పసిగుడ్డు నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు. అయితే, బిడ్డ పుట్టిందనే విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త తండాకు వెళ్లి వివరాలు సేకరించింది. అక్కడికి పాప మరణించిందని తెలపగా.. ఆరా తీసింది. ఆమె తండ్రే చిన్నారిని చంపిన విషయం తెలుసుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Latest News

More Articles