మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘట న మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు.
Also Read… ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ పంచుకోవాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు..!!
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలపల్లికి చెందిన మంగళారం అంతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మి(55), చిన్న భార్య చంద్రమ్మ(40). వీరిద్దరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తెల్లవారుజామున చిన్న భార్య చంద్రమ్మ మృతి చెందగా.. కొన్ని గంటల వ్యవధిలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో పెద్ద భార్య లక్ష్మి కూడా మరణించింది. ఇద్దరు భార్యలు ఒకేసారి కాలం చేయడంతో భర్త అంతయ్య శోకసంద్రంలో మునిగిపోయాడు.
Also Read.. వన్ ప్లస్ నుంచి సరికొత్త టాబ్లెట్..ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే..!!
పెద్ద భార్యకు పిల్లలు కాకపోవడంతో చిన్న భార్యను వివాహం చేసుకున్నాడు. చిన్న భార్యకు కుమారుడు వినయ్ (12) ఉన్నాడు. అయితే.. అంతయ్యది నిరుపేద కుటుంబం. పైగా వారి వారి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకుడు షాబాద్ దర్శన్ గ్రామానికి చేరుకుని వారికి అండగా నిలిచి అంత్యక్రియలు పూర్తయ్యేలా చూశారు.