మలక్ పేట్ లోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక సోహైల్ హోటల్ లోని కిచెన్ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి…దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రభావం దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి వరకు పొగ వ్యాపించి రోగులు ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని అక్కడ నుంచి తరలించారు. అటు హోటల్ లోనూ పొగ వ్యాపించటంతో కస్టమర్లు పరుగులు తీశారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక హోటల్లో పనిచేసే కార్మికుడు షాబుద్దీన్ (34) అనే వ్యక్తి చనిపోయాడు. కిచెన్లో కరెంట్ షాక్ గానీ గ్యాస్ లీకేజీ గానీ జరిగి ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.