Tuesday, May 7, 2024

ఫ్రెండ్స్‎తో దావత్.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని స్నేహితుడు మృతి

spot_img

వారిద్దరూ మంచి దోస్తులు. అందుకే తాము చేసే పని కూడా ఒకేచోట చూసుకున్నారు. ఒకే గదిలో ఉంటూ, కలిసి పనిచేసుకుంటూ సరదగా గడుపుతున్నారు. పనిలో రోజూ బిజీగా ఉండే వారిద్దరూ.. ఓ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటుండగా, చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ స్నేహితుడు చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Read Also: సంక్రాంతికి ఊరెళ్లేవారికి బ్యాడ్ న్యూస్.. 50 శాతం అదనపు చార్జీలు!

జార్ఖండ్‎కు చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ కొంతకాలంగా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వారిద్దరూ మంగళవారం సాయంత్రం దావత్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. దావత్ అంటే మామూలుగా ఉంటుందా.. నాన్ వెజ్ తప్పని సరి మరి. అందుకు తగ్గట్లు ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. చికెన్ తెచ్చుకొని, అందులో తినడానికి పూరి కూడా చేసుకున్నారు. వంటలన్నీ పూర్తయ్యాక.. చాలా హ్యాపీగా పార్టీని మొదలుపెట్టారు. మందు తాగిన తర్వాత భోజనం చేస్తుండగా జితేంద్రకుమార్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. ఏం జరిగిందో ధర్మేందర్‎కు అర్థం కాలేదు. మందు ఎక్కువ తాగడం వల్లే జితేంద్ర పడిపోయి ఉంటాడని అనుకున్నాడు. కాసేపు అతన్ని గమనించిన ధర్మేందర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జితేందర్ శ్వాస తీసుకోవడం లేదని గమనించిన ధర్మేందర్.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles