Friday, May 10, 2024

కన్నతల్లి కర్కశత్వం..మూడోసారి ఆడపిల్ల పుట్టిందని..

spot_img

మగబిడ్డకోసంఎదురుచూసిన ఓ మహిళకు మూడోసారీ ఆడబిడ్డే పుట్టింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ఆ మహిళను బిడ్డను గ్రామ శివారులో పడేసింది.ఈ విషాదకరమైన ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ తండాలో చోటుచేసుకుంది. కేస్లాపూర్కు చెందిన గంగక్కకు ఇద్దరు కుమార్తెలుఉన్నారు. పెద్దకూతురుకు వివాహం జరిగింది.రెండో కూతురుకు పెండ్లి వయస్సు వచ్చింది. మగబిడ్డకోసం ఎదురుచూసి మరోసారిగర్భం దాల్చింది.

కాగా బుధవారంరాత్రి మూడోకాన్పులోనూ ఆడబిడ్డ జన్మించింది. దీంతో తీవ్ర మనోవేదనకుగురైంది. పెళ్లయిన కూతురుఉండగా మళ్లీగర్భందాల్చడం అవమానకరంగా భావించింది. అప్పుడేపుట్టిన శిశువును గ్రామ శివారులోని చేలల్లో పడేసి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గురువారం శిశువును మృతదేహాన్నికుక్కలు గ్రామం దగ్గరికి లాక్కొని రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్సై ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ నిమిత్తం గంగక్కను పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: మనిషికి పంది కిడ్నీ.. తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు.!

Latest News

More Articles