అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. ఏటా కొత్త సంవత్సరం వేళ ఏపీలోని రెండు గ్రామాలు ఏటా కబడ్డీ పోటీలు నిర్వహించుకుని వేడుకలను జరుపుకుంటారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వంపాడంలో రాత్రి రెండు గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఎరుగొండ-కొవ్వాడ గ్రామ జట్ల మధ్య హోరాహోరిగా మ్యాచ్ జరుగుతుండగా.. ఎరుగొండ వాసి రమణ తలకు తీవ్ర గాయమైంది.
తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే విశాఖ కేజీహెచ్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.