Thursday, May 2, 2024

పండ్లరసంలో విషం కలిపారు.. ఆసుపత్రిలో ఉన్నా

spot_img

ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఆరోపిస్తూ ఇవాళ(శుక్రవారం) తెలిపారు. వేలూర్‌ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు.

బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే అలీఖాన్‌ను గుడియాత్తంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐసియులో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని ఆరోపిస్తూ … మస్సూర్‌ అలీఖాన్‌ ప్రకటన విడుదల చేశారు. తాను గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారని… పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి: మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

 

 

 

Latest News

More Articles