Thursday, May 2, 2024

రూ.112కే ౩డీలో ఆదిపురుష్‌

spot_img

హైదరాబాద్:  ఆదిపురుష్‌ సినిమా టిక్కెట్లపై భారీ తగ్గింపును ప్రకటించారు మేకర్స్. 3డీ వెర్షన్ రేట్లను భారీగా తగ్గించారు. సోమవారం నుంచి ఈ సినిమా మల్టీప్లెక్సులలో కేవలం రూ.112కే అది కూడా ౩డీలో చూసే ఆఫర్‌ను ప్రకటించింది. ఆ ఆఫర్‌ చివరి వరకు ఉండనుంది. అంతేకాకుండా మార్చిన డైలాగ్స్‌తో ఈ సినిమాను ప్రదర్శితం చేయనున్నట్లు తెలిపింది.

ఆదిపురుష్ ఇప్పటివరకు 400 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబట్టింది. మరో వంద కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తే హిట్‌ అనే ట్యాగ్‌ను పొందుతుంది. ప్రభాస్‌ రాఘవుడిగా.. కృతిసనన్‌ జానకిగా కనిపించిన ఈ సినమాకు ఓంరౌత్‌ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ లంకేష్ పాత్ర పోషించాడు.

Latest News

More Articles