హైదరాబాద్: రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.