స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మ్యాచ్పై పట్టుబిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో తాము చేసిన స్కోరు (310) కంటే కివీస్కు ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యమే ఇచ్చిన బంగ్లాదేశ్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో మాత్రం రెచ్చిపోయింది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హోసెన్ శాంతో 104 నాటౌట్ (193 బంతుల్లో, 10 ఫోర్లు) శతకం సాధించాడు.
దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 68 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆ జట్టు ఆధిక్యం ప్రస్తుతం 205 పరుగులుగా ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండటంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు కేన్ విలియమ్సన్ సెంచరీ సాయంతో ఓవర్ నైట్ స్కోరు 266-8 పరుగుల వద్ద మూడో రోజు ఆట మొదలుపెట్టిన కివీస్ 317 పరుగులకు ఆలౌట్ అయింది.
A solid century from captain Najmul Hossain Shanto has put Bangladesh on top 👏#WTC25 | #BANvNZ | 📝: https://t.co/KSYuqT5oeG pic.twitter.com/AlI7pNsWWB
— ICC (@ICC) November 30, 2023