Thursday, May 2, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

spot_img

పండ్లలో రారాజు మామిడి పండు.వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో మామిడి పండ్ల ఘుమఘమలు వస్తుంటాయి. ఎక్కడ చూసిన మామిడి పండ్లే కనిపిస్తుంటాయి. పసుపు రంగులో, జ్యుసిగా, తీపిగా, పులుపుగా ఉండే ఈ మామిడి పండ్లను చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. మీరు కూడా మామిడి పండ్లను తినడానికి ఇష్టపడితే, మామిడి పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోండి. మామిడి పండ్లను తినేటప్పుడు తరచుగా చాలా మంద కొన్న తప్పులు చేస్తారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.రుచి పేరుతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ రోజు మనం మామిడి పండు తినడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకుందాం. మామిడి పండు తినే అరగంట ముందు ఈ పని తప్పక చేయాలి. ఇలా చేస్తే మీరు మామిడి పండు తినడం వల్ల పూర్తి ప్రయోజనం పొందుతారు.

మామిడి పండ్లను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి?

ఫైటిక్ యాసిడ్ తొలగించబడుతుంది:
ఫైటిక్ యాసిడ్ అనే పదార్ధం సహజంగా మామిడిలో కనిపిస్తుంది. ఇది యాంటీ న్యూట్రియంట్‌గా పరిగణిస్తారు. ఈ యాసిడ్ శరీరంలో కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాల వినియోగాన్ని నిరోధిస్తుంది. ఇది శరీరంలో మినరల్స్ లోపానికి కారణం కావచ్చు. అందువల్ల, మామిడిని కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం వల్ల అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.

పురుగుమందులు :
మామిడి పండ్లను పండించడానికి అనేక రకాల పురుగుమందులు ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు కడుపు, జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది తలనొప్పి, మలబద్ధకం,అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. ఈ హానికరమైన రసాయనాలు చర్మం, కళ్ళు, శ్వాసకోశ చికాకును కలిగిస్తాయి. అందువల్ల, తినడానికి ముందు అరగంట పాటు నీటిలో నానబెట్టండి.

మామిడి వేడిని తగ్గిస్తుంది:
మామిడిని నీటిలో నానబెట్టి ఉంచడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి ప్రకృతిలో కాస్త వేడిగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి ముఖంపై దద్దుర్లు రావచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. మామిడికాయను నీటిలో నానబెట్టడం వల్ల మామిడి వేడి తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

Latest News

More Articles