Sunday, April 28, 2024

కడియం శ్రీహరి నువ్వా విలువల గురించి మాట్లాడేది

spot_img

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో క‌డియం శ్రీహ‌రి ప‌దేండ్ల కాలంలో ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారు. ఆ గౌర‌వం కేసీఆర్ క‌ల్పించార‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి తెలిపారు. వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీడియా స‌మావేశంలో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడారు.

రేపు(శనివారం) స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో మీటింగ్ పెడుతున్నాం. మీరు లేన‌ప్పుడే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో గులాబీ జెండా ఎగిరింది. ఆనాటి టీఆర్ఎస్‌లో మీకు చావుదెబ్బ తగిలింది. 2001లో పార్టీ పుట్టిన‌ప్పుడే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు గెలిచాం. గులాబీ కోట‌లో చీడ పురుగుల్లా వ‌చ్చి.. కోట‌ను నాశ‌నం చేసేందుకు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బంది పెట్టారు. రేప‌టి మీటింగ్ బ్ర‌హ్మాండంగా స‌క్సెస్ అవుతుంది. అంద‌రూ కేసీఆర్ వెంటే ఉంటారు అని సుద‌ర్శ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ప‌దేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా క‌డియం ఖాళీ లేరు. డిప్యూటీ సీఎంగా , ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశం ఇచ్చారు కేసీఆర్. పార్టీ నాయ‌కులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి, ప‌ని చేసి ఎంపీగా గెలిపించారు. ఇత‌ర నాయ‌కులు మీ కోసం ఎంతో త్యాగం చేశారు. ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మీతో ప‌ది మంది కూడా రాలేదు. ఇవాళ మీతో ప‌ది మంది కూడా రారు. నిత్యం విలువల‌ గురించి మాట్లాడ‌టం బంద్ పెట్టాలి. మీరే పునీతులు అని ఇత‌రులు అప‌విత్ర‌లు అనేలా మాట్లాడటం ఇకపై చెల్ల‌వని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి.

ఇది కూడా చదవండి: పార్టీ మారుతున్న వారంతా మాన‌వ‌త్వం లేని వారు

Latest News

More Articles