Friday, May 10, 2024

రేవంత్ రమ్మంటున్నాడు..పార్టీ మారే ఆలోచన లేదు.!

spot_img

తాను బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రశాక్ గౌడ్ కొట్టిపారేశారు. తనను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు పార్టీలోకి ఆహ్వానించిన విషయం నిజమే అయినప్పటికీ..తాను పార్టీ మారే ఆలోచనే అస్సలు లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయన్న ప్రకాశ్ గౌడ్..కార్యకర్తల అభిష్టమే తన అభిప్రాయమని..వారితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నారు.

నాలుగుసార్లు తన గెలుపునకు అహర్నిశలు శ్రమించిన ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయలే తనకు ముఖ్యమని రేవంత్ కు తెలిపినట్లు చెప్పారు. ఈ మేరకు మూడు మండలాల ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించాలని, వారిలో అత్యధిక శాతం మంది కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని తేల్చిచెప్పారని ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా తాను నాయకులు, కార్యకర్తల మాటలను జవదాటకండా ఏ పార్టీలోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరవేసేందుకు తాను క్రుషి చేస్తానని వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎవరూ ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని ప్రశాశ్ గౌడ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: రెచ్చిపోయిన హైదరాబాద్..తోకముడిచిన ఢిల్లీ..!

Latest News

More Articles