Wednesday, May 8, 2024

నేడు సిద్ధిపేటకు మట్టిబిడ్డ…లక్షమందితో కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ..!!

spot_img

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు సిద్ధిపేటలో అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధిపేటలో నిర్వహించ తలపెట్టిన ప్రజాఆశీర్వాద సభకు గులాబీ బాస్ హాజరుకానున్నారు. సిద్ధిపేట పట్టణశివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ సాయంత్రం 5గంటలకు సీఎం చేరుకుంటారు. దాదాపు 1లక్ష మంది జనంతో సభను నిర్వహించేందుకు సిద్ధిపేటలో బీఆర్ఎస్ కు ఎదురే లేదని చాటిచెప్పేందుకు పార్టీశ్రేణులు సిద్ధమవుతున్నారు.

సిద్ధిపేటకు సీఎం రానున్నడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సిద్ధిపేటంతా గులాబివనంలా మారింది. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు భారీ కట్ అవుట్లే కనిపిస్తున్నాయి. ఈ సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చదంగా సీఎం కేసీఆర్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తరలివస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత సిద్ధిపేటలో సీఎం నిర్వహించే మొదటి సభ కావడంతో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది.

ఇది కూడా  చదవండి: నవరాత్రుల్లో ఈ 5 వస్తువులు కొనుగోలు చేస్తే..ధనానికి లోటు ఉండదట..!!

కాగా సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ తోపాటు పలు ప్రదేశాల్లో పోలీసు అధికారులతో కలిసి సీపీ శ్వేత సందర్శించారు.

సిద్ధిపేటమట్టిబిడ్డకు ఘనస్వాగతం పలకాలంటూ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు పలు గ్రామాల నుంచి 20వేల మంది యువకులు మోటార్ సైకిళ్లపై సభకు వచ్చేందుకు రెడీ అవుతునున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

ఇది కూడా  చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: యూపీఐ సేవల్లో సమస్యలు

 

Latest News

More Articles