మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణంలోని అటవీ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు తల్లి కొడుకులను చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. గతంలో తనపై ఉన్న కేసు విషయమై లక్ష్మణ్ అనే యువకుడు సెక్షన్ ఆఫీసర్ ను ప్రశ్నించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన ఫారెస్ట్ అధికారులు తల్లి కొడుకులను చితకబాదారు. దాడిలో స్పృహ కోల్పోయిన లక్ష్మణ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు వాపోయారు.