కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందన్నారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ మాట్లాడుతూ… 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ ఈ కరీంనగర్ గడ్డ నుంచే సింహగర్జణ చేశారని, ఆ తర్వాత విజయవంతంగా లక్ష్యాన్ని సాధించారని గంగుల గుర్తుచేశారు.
దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రారంభించి సక్సెస్ఫుల్గా అమలు చేసిందని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ కరీంనగర్ గడ్డ నుంచే కదనభేరి మోగించేందుకు సీఎం వచ్చారని అన్నారు. ఈ కదనభేరితో లోక్సభ ఎన్నికల కదనరంగంలో దూకి ఘన విజయం సాధిద్ధామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో కొట్లాడి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత అప్పటి మన ఎంపీ నోద్కుమార్కే దక్కుతుందన్నారు గంగుల కమలాకర్.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి