Tuesday, April 30, 2024

శారీరకంగా వాడుకొని వదిలేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

spot_img

ప్రేమిస్తున్నాని చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని అదే ప్రాంతానికి చెందిన బీసీ వర్గంలోని గోపాలకృష్ణ అనే యువకుడు ఇన్ స్టాగ్రాం యాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ పరిచయం చేసుకున్న క్రమంలో ఒకరికి ఒకరు తెలియదు. కానీ వారి మధ్య ఉన్న పరిచయం కాస్తా పెరగడంతో తర్వాత వారు ఒకే ప్రాంతం వాసులమని తెలుసుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ నేపథ్యంలోనే వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆ యువకుడి మాటలు నమ్మిన యువతి అతనితో శారీరకంగా కలిసింది. అలా పలుమార్లు జరిగిన తర్వాత ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని శనివారం ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని మౌన పోరాటానికి దిగింది. రాత్రి కూడా గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయకుండా నిరసన తెలపి, అందరిని ఆలోచనలో పడేసింది.

Read Also: పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారులో 8 మంది సజీవదహనం

Latest News

More Articles