దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనాతో ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,997కి పెరిగింది. ఈ వైరస్ కారణంగా నిన్న(శుక్రవారం) ఒక్కరోజే కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. తాజా మరణాలతో కలిసి ఇప్పటివరకు కరోనా ప్రారంభం నుంచి 5,33,358 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నేత జయప్రద కోసం వెతుకుతున్న పోలీసులు