Monday, May 6, 2024

పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించిన భారత జట్టు

spot_img

దాదాపు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత డేవిస్‌ కప్‌ జట్టు ప్రపంచ గ్రూప్‌-1లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన డబుల్స్‌లో 4-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.  భారత్ కు చెందిన సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి 6-2, 7-6(5) తేడాతో పాక్‌ జోడీ ముజామిల్‌-బర్కతుల్లాని మట్టికరిపించారు. సింగిల్స్ లో పూనాచా వరుస సెట్లలో 6-3 6-4 తేడాతో షోయాబ్‌పై విజయం సాధించాడు. కాగా, శనివారం తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్‌ ఖురేషిపై,  రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ 7-5, 6-3తో అకీల్‌ఖాన్‌పై నెగ్గిన విషయం తెలిసిందే.

Also Read.. ప్రభుత్వాన్ని కూల్చే అవ‌స‌రం బీఆర్ఎస్‌కు లేదు

Latest News

More Articles