Tuesday, April 30, 2024

జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

spot_img

ఈ నెల(జూన్) 12వ తేదీ నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌ల‌ నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్  విద్యార్థుల‌కు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు.. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

హాల్ టికెట్ల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల‌తో విద్యార్థుల‌కు ప‌రీక్షా కేంద్రాల‌కు వ‌స్తే.. వారిని త‌ప్ప‌కుండా అనుమ‌తించాల‌ని బోర్డు అధికారులు చీఫ్ సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. హాల్ టికెట్ల‌పై ఆయా కాలేజీల ప్రిన్సిప‌ల్స్ సంత‌కాలు త‌ప్ప‌నిస‌రి కాద‌ని స్ప‌ష్టం చేశారు.

Latest News

More Articles