Tuesday, May 7, 2024

ఓటేసేందుకు క్యూలో నిల్చుకున్న ఇస్రో చీఫ్..వైరల్ వీడియో.!

spot_img

ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటు వేశారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సామాన్యుల వలే క్యూలైన్లో నిల్చుండి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 1గంటపాటు క్యూలైన్లో నిల్చున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా మధ్యాహ్నం 12గంటల వరకు కేరళలో 31.06శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 11గంటల వరకు తిరువనంతపురంలో 23.72 శాతం,అట్టింగల్ లో 26.03 శాతం, కొల్లామ్ లో 23.82శాతం, పాతానమిట్టలో 24.38శాతం మావెలిక్కరలో 24.56శాతం, అలప్పుజాలో 25.28శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే అరిష్టం..!

Latest News

More Articles