Tuesday, May 7, 2024

బాలయ్య vs ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు

spot_img

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివగంగాత ఎన్టీఆర్ 27వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చి తొలుత ఎన్టీఆర్ నివాళులు అర్పించగా.. బాలకృష్ణ ఆ తరువాత రావటం జరిగింది. అయితే ప్రతిసారి ఎన్టీఆర్ ని చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చినట్టే ఈ రోజు కూడా భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంతం మారుమ్రోగింది. అక్కడ పెద్ద ఎత్తున ఆయన ఫ్లెక్సీలు కనిపించాయి.

అయితే ఎన్టీఆర్ వెళ్లిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించి వెళ్లారు. ఆ వెంటనే కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుండి తీసివేశారు. ఈ ఉదంతంతో అక్కడున్న ఎన్టీఆర్ అభిమానులు కంగుతిన్నారు. బాలయ్య ఆదేశాలతోనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేస్తున్నారా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ఎలెక్షన్స్ దృష్ట్యా బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ గొడవ ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశం అవుతుంది.

Latest News

More Articles