పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, తాయిత్తు కట్టించుకువస్తానని వెళ్లిన తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యం అయింది. ఈ ఘటన హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్పీఆర్ హిల్స్ ఓంనగర్ ప్రాంతంలో నివాసముండే లత (26)కు ఇద్దరు పిల్లలు అక్షిత (7), నిహారిక(5). ఆమె తన తల్లి విజయ, భర్తతో కలిసి ఉంటోంది. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పిల్లలకు తాయిత్తు కట్టించుకోస్తానని బయటకు వెళ్లింది. కాసేపటికి తల్లి ఫోన్ చేయగా.. 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పింది. అరగంట తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో.. ఫోన్ చేస్తే తన భర్త నాగరాజు రోజూ తాగొచ్చి పెట్టే బాధలు భరించలేకపోతున్నానని ఏడుస్తూ లత ఫోన్ పెట్టేసింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో లత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: విద్యార్థులకు గుడ్న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు