Sunday, April 28, 2024

తెలంగాణ‌లో ప‌లువురు ఐఏఎస్‌ల బ‌దిలీలు

spot_img

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. హెచ్ఎండీఏ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ఆమ్రపాలి నియమితులయ్యారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా శైల‌జా రామ‌య్య‌ర్, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్‌గా బీ గోపి నియామ‌కం అయ్యారు.

డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్క‌ర్, ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శిగా రిజ్వి, ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, ద‌క్షిణ డిస్క‌మ్ సీఎండీగా ముషార‌ఫ్ అలీ, ఉత్త‌ర డిస్కం సీఎండీగా క‌ర్ణాటి వ‌రుణ్ రెడ్డి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Latest News

More Articles