Sunday, April 28, 2024

టికెట్ నిరాకరించడంతో విషం తాగిన ఎంపీ..చికిత్స పొందుతూ మృతి.!

spot_img

తమిళనాడులో విషాదం నెలకొంది. 2024 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ ఎంపి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

తమిళనాడులోని ఈరోడ్‌ నుంచి ప్రస్తుత లోక్‌సభ ఎంపీ, ఎండిఎంకేకి చెందిన గణేష్‌మూర్తి గురువారం ఉదయం మరణించారు. ఉదయం 5:05 గంటలకు గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తరువాత, అతను మార్చి 24 న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎంపీ గణేష్‌మూర్తిని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. పరీక్షల అనంతరం వైద్యులు ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు.ఎంపీ పురుగుమందు సల్ఫాస్ విషాన్ని తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎంపీ గణేష్‌మూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చెయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్..!

Latest News

More Articles