రేపు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ లో 100 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన అనంతరం నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మంత్రులు KTR ,జగదీష్ రెడ్డి లు పాల్గొంటారు. ఈ మేరకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ భారీ ఏర్పాట్లు చేశారు. తిరుమల గిరి పట్టణాన్ని గులాబీ మయం చేశారు. సభ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
2014 నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో జరిగిన అభివృద్ధి ని ప్రజలకు వివరించే విధంగా సభ జరగనుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జరిగిన విప్లవాత్మకమైన మార్పును ప్రజలకు వివరించనున్నారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా నియోజకవర్గంలో ని బీడు భూములకు కాళేశ్వరం జలాలు అందించి సస్యశ్యామలO చేసిన కృషిని వివరించనున్నారు. 2014 నుండి నియోజకవర్గంలో 5 వేల కోట్లతో జరిగిన అభివృద్ధి, సన్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పనున్నారు. KTR రాక సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా క్యాడర్ ఉత్సాహంగా తరలి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.