Sunday, April 28, 2024

కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది.. బిజెపికి ఉనికి లేదు

spot_img

వికారాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, బిజెపికి ఉనికి లేదు.. ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు. దుద్యాల మండలంలోని  పోలేపల్లిలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదన్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కెకడిదన్నారు. 25 సంవత్సరాలుగా గుర్నాథ్ రెడ్డి, 10 ఏళ్లుగా రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప.. కొడంగల్ కు ఒరగబెట్టింది ఏమి లేదని పేర్కొన్నారు. ప్రజలకు కన్నీటి కష్టాలను మిగిల్చారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.

Latest News

More Articles