Tuesday, May 7, 2024

కేటీఆర్ గారి ఆలోచనలతో వార్డు కార్యాలయాలు..!

spot_img

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వార్డు కార్యాలయాలపై మంత్రి తలసాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాము. కేటీఆర్ గారి ఆలోచనలతో వార్డు కార్యాలయాలు. ఎస్ఎన్ డిపి మరియు ఈ వి డి ఎం లను ఏర్పాటు చేసుకున్నాము. గత ప్రభుత్వాల నుండి డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయం లేదు. కానీ రాష్ట్రం సాధించుకున్న తర్వాత జీహెచ్ ఎంసి లో సమన్వయం సాధించాము. ఇది కొత్త ఆలోచన.

వార్డు ఆఫీస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా అందరి పక్షాన సిఎం కేసీఆర్, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు మన నగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. కొత్త ఆలోచనకు మీడియా సహకరించాలి. ఎస్ ఎన్ డి పి తీసుకున్న తర్వాత గతంలో కంటే ఎక్కువ వర్షం వచ్చిన ఇబ్బంది కాలేదు. సిఎస్ఆర్ ఫండ్ తో పార్క్ ల రూపురేఖలు మారుతున్నాయి. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పించాలి. వార్డు కార్యాలయాల ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు మంత్రి తలసాని.

Latest News

More Articles