Thursday, May 2, 2024

రోహిత్‌ శర్మకు షాకిచ్చిన ముంబై ఇండియన్స్‌!

spot_img

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఐదు ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జట్టు మేనేజ్ మెంట్ భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ – 2024 సీజన్‌కు కొత్త సారథిని ప్రకటించింది.

రెండేండ్ల క్రితమే ఆ జట్టు తప్పించి, తాజాగా ఐపీఎల్‌ ట్రేడ్‌ ఆప్షన్‌ ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి వచ్చిన ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. దీంతో గత పదేండ్లుగా కెప్టెన్ గా ఉంటున్న రోహిత్‌ ను పక్కనబెట్టినట్టయింది. కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్‌లో హిట్‌మ్యాన్‌ శకం ముగిసినట్టైందని క్రికెట్ అనలిస్టులు చెప్పారు.

Latest News

More Articles