Sunday, May 5, 2024

కేసీఆర్‌ ని కలిసిన నాగార్జున

spot_img

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్ర శేఖర రావు క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరగవుతోంది. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని మళ్లీ ఆయనను ప్రజాక్షేత్రంలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి, తెలంగాణ బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ను స్వయంగా కలిసి పరామర్శించారు.

తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ గారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌లతో కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ, సహకార శాఖా మత్రి తుమ్మల నాగేశ్వర రావు కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనను పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

Latest News

More Articles