Monday, May 6, 2024

డీఎస్పీ ఇంటికి సమీప బ్యాంకులో చోరీ ..!!

spot_img

బీహార్ లోని అరారియాలో డీఎస్పీ అధికారి ఇంటికి సమీపంలో ఉన్న ఓ బ్యాంకులో చోరీ జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోరి ఏడీపీ చౌక్ దగ్గర ఉన్న యాక్సిస్ బ్యాంకులోకి చొరబడిన దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. రూ. 90లక్షల నగదుతో ఉడాయించారు. చోరీకి వచ్చిన సమయంలో దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రామభక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి అయోధ్యుకు 17 స్పెషల్ ట్రైన్స్..!!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకుకు సీల్ వేశారు. లోపలికి వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగిందని బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. రూ. 90లక్సల నగదు చోరీకి గురైందన్న విషయాన్ని మాత్రం ఎస్పీ అకోక్ కుమార్ సింగ్ నిర్ధారించలేదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నట్లు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు.

Latest News

More Articles