Wednesday, May 1, 2024

మోదీ కంటే గొప్పోళ్లు ఉన్నారనుకునేవాళ్లు దేశ ద్రోహులేనట..

spot_img

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన..మోదీ, యోగిని సొంతవారిగా భావించాలని..అలా భావించకుంటే తమ తల్లిదండ్రులను కూడా తమవారిగా పరిగణించరని పేర్కొన్నారు. మహేశ్ శర్మ ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ప్రసంగం వీడియోను మొదట ఏప్రిల్ 12న ఒక వార్తా సంస్థ షేర్ చేసింది. అయితే బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎక్స్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ, ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని కోరారు.“డియర్ ఎలక్షన్ కమీషన్, మీరు ఎవరితో ఉన్నారో నిర్ణయించే సమయం ఆసన్నమైంది? మీరు నిష్పక్షపాతంగా ఉంటే చర్య తీసుకోండి. లేదంటే ఎన్నికల కమిషన్ కూడా మోదీ, మహేశ్ శర్మలకు మద్దతు పలుకుతుందని భావించాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకుడు ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు..సీఎం సంచలన వ్యాఖ్యలు..!

Latest News

More Articles