తెలంగాణ భవన్ లో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోలేదు. పెద్దపల్లి జిల్లాల్లో సాగునీటి బాధ తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎక్కడ చూసిన పచ్చగా మారింది.
ఎన్ని ఛాన్సులు ఇచ్చిన చేయని వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? ఖర్గే సొంత రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇస్తే ఇప్పుడు కర్ణాటక ఆగమయ్యింది. కర్ణాటకలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. 5గంటల కరెంట్ కూడా ఉండట్లేదు. మొసళ్ళు తీసుకెళ్ళి సబ్ స్టేషన్ లో వదిలిపెట్టారు అక్కడి రైతులు. కర్ణాటక గోస మనకు అవసరమా? కాంగ్రెస్ అధికారం లోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారు’ అని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.