Sunday, May 5, 2024

కేబుల్‌ బ్రిడ్జిపై పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్‌… అర్థ‌రాత్రి వ‌ర‌కు నిఘా

spot_img

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై న‌గ‌ర పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల కేబుల్‌ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అలర్టయ్యారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్‌ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఎలాంటి అకాతాయి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా నిఘా పెట్టారు.

ఈ క్ర‌మంలో కేబుల్ బ్రిడ్జ్ పై స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్‌ చేసిన వారికి చలానా విధిస్తున్నారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్‌ చేయడం, బర్త్‌ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్‌ చేసి రెండు వైపులా ఉన్న పాత్‌ వేలోనే సందర్శకులు ఉండాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: టెట్ దరఖాస్తుల గడువు పొడగింపు.. ఎప్పటి వరకు అంటే..?

Latest News

More Articles