యువత భవిష్యత్తుల్లో రాణించాలంటే క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో కూతకు వెళ్లిన ఆయన కాలుజారి కిందపడ్డారు. దీంతో అక్కడున్నవారు మంత్రిని పైకి లేపారు. అయితే ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత కూడా మంత్రి హుషారుగా కబడ్డి ఆడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తాను కూడా చిన్నప్పుడు కబడ్డీ ఆడేవాడినని చెప్పారు.
కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/t8i0pWd5xq
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024