మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంల వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
నిన్న తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులు పద్మావతి నగర్ లోని ఫోనిక్స్ వెంకటేశ్వర నిలయంలో బస చేశారు. రామ్ చరణ్ ను చూసేందుకు ఇప్పటికే భారీగా అభిమానులు తిరుమలకు చేరుకున్నారు. రెండు రోజు నుంచే చిరంజీవి, రామ్ చరణ్ తిరుమలకు వస్తారని ప్రచారం జరిగింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే రామ్ చరణ్ కోసం అభిమానులు పడిగాపులు కాచారు. బుధవారం చరణ్ వెనుతిరిగే వరకు అభిమానులు అతిథి గ్రుహం వద్ద ఆలయం వద్ద హంగామా స్రుష్టించారు.
#WATCH | Andhra Pradesh: Actor Ram Charan along with his family on his birthday, visited & offered prayers at the Tirupati Balaji Temple. pic.twitter.com/Ugq0byNirp
— ANI (@ANI) March 27, 2024
కాగా తిరుమల దర్శనానికి క్యూలైన్లో వెళ్లేటప్పుడు పాపను ఉపాసన ఎత్తుకున్నారు. అప్పుడు అనుకోకకుండా పాప క్లింకార మొహం కనిపించింది. రామ్ చరణ్ కూతురు చూడటానికి బాగుంది. అచ్చం తండ్రిలా ఉందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.