Sunday, April 28, 2024

ఐపీఎల్ ఆ యువకుడి తలరాతను మార్చేసింది..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!

spot_img

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. ఒడలు బండ్లు కావచ్చు..బండ్లు ఓడలు కావచ్చు. డబ్బున్నవారు పేదలు కావచ్చు..పేదలు కోటీశ్వరులుగా మారవచ్చు. కటిక పేదరికంలో ఉన్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సంఘటనలు ఎన్నో చూశాం. ఉత్తరాఖండ్ కుచ చెందిన ఓ యువకుడి విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. రాత్రికి రాత్రే లక్ష్మీదేవి తలుపులు తట్టింది. అతను కోటీశ్వరుడయ్యాడు. ఆదివారం జరిగిన గుజరాత్, ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ రూపంలో అతడిని లక్ష్మీదేవి వరించింది. కోటి రూపాయలు తీసుకువచ్చింది.

అసలు విషయం ఏంటంటే…ఉత్తరఖాండ్ లోని అల్మోరాకు చెందిన ప్రశాంత్ బోరా..ఆదివారం జరిగిన ముంబయి వర్సెస్ గుజరాత్ మ్యాచ్ పై డ్రీ11లో డబ్బులు పెట్టాడు. తాను సెలక్ట్ చేసుకున్న టీమ్ మెంబర్స్ అద్బుతమైన ప్రదర్శనతో మంచి ర్యాంక్ సాధించాడు. డ్రీమ్ 11లో అతని జట్టుకు 8వ ర్యాంకు వచ్చింది. తన టీంలో 8వ ర్యాంక్ చూసిన ప్రశాంత్ షాక్ అయ్యాడు. తనకు ఇంత ర్యాంకు వస్తుందని ఊహించలేదు. 8వ ర్యాంక్ రావడంతో కోటిరూపాయల మనీ ప్రైజ్ దక్కింది. దీంతో కుటుంబ సభ్యులు సంతోషంతో ఎగిరిగంతేశారు.

ప్రసుత్తం డ్రీమ్ 11 సహా అనేక ఫాంటసీ క్రికెట్ లీగ్స్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ఫ్లాట్ ఫామ్స్ పై చాలా మంది తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే లక్షలాది మందిలో అతికొద్దిమందిని మాత్రమే ఈ అద్రుష్టం వరిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి భారీ వేతనంతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

Latest News

More Articles