Thursday, May 9, 2024

కమ్మేసిన పొగమంచు.. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

spot_img

పొగమంచు కమ్మేయడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళిలన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. స్థానికల కథనం మేరకు.. వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న బస్సు ఇబ్రహీంబాద్‌ గేటు వద్దకు రాగానే విపరీతంగా పొగమంచు కమ్మేయడంతో రోడ్డు కనిపించక అదుపుతప్పి పక్కకు వెళ్లింది.

దాంతో అప్రమత్తమైన డ్రైవర్‌ అదుపుచేయడంతో ఓ వైపునకు ఒరిగింది. బస్సులోని 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Latest News

More Articles