Monday, May 6, 2024

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..బస్సులో 50మంది ప్రయాణీకులు..!!

spot_img

మేడాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది. కాటారం, భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల డీపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ తోపాటు పలువురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: రైల్వేలో 9వేల టెక్నీషియన్ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు షురూ..!!

Latest News

More Articles