దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మీటింగ్కు భారత ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు హాజరువుతున్నారు.అయితే ఆ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా హాజరుకావడంలేదు. ఆయనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రిని సమావేశాలకు పంపారు. కాగా, పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా నేతపై అంతర్జాతీయ క్రికెట్ కోర్టులో కేసు ఉంది. చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిన కేసులో పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఐసీసీ అరెస్టు వారెంట్ నేపథ్యంలో పుతిన్ .. బ్రిక్స్ సమావేశాలకు హాజరుకావడం లేదని సమాచారం. అరెస్టు చేస్తారేమో అన్న భయంతో ఆయన మీటింగ్కు వెళ్లడం లేదన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.