‘జాతిరత్నాలు’ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన అనుష్క కాంబినేషన్లో తెరకెక్కిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పి. మహేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్ తదితరులు నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలైంది. అదే రోజు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కూడా విడుదలైంది. దాంతో తొలిరోజు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ మీద ‘జవాన్’ ప్రభావం పడింది. కానీ, ఆ తర్వాత మెల్లగా మౌత్ టాక్ ద్వారా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ పుంజుకుంది. వీకెండ్లో కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాగా మారిపోయింది.
తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్బాబు చూశాడు. అనంతరం సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ‘సినిమా మొత్తం నవ్వులతో నిండిపోయింది. కుటుంబంతో కలిసి సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, అనుష్క నటన అద్భుతంగా ఉంది. డైరెక్టర్ మహేష్.. అలాగే యూవీ క్రియేషన్స్కు అభినందంనలు’ అంటూ ట్వీట్ వేశాడు. ఇలా ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ నుంచి ట్వీట్ రావడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇంతకుముందు షారూక్ జవాన్ సినిమాను కూడా చూసి బ్లాక్ బస్టర్ అంటూ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు.