Saturday, May 4, 2024

బుమ్రా సారథ్యంలో టీమిండియా ఐర్లాండ్‌ టూర్

spot_img

జస్ప్రీత్‌ బుమ్రా సారధ్యంలోని భారత జట్టు ఇవాళ(మంగళవారం) ఐర్లాండ్‌కు పయనమైంది. కెప్టెన్‌ బుమ్రాతో పాటు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే ఉన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్‌కు బయలుదేరారు. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగమైన తిలక్‌ వర్మ, అవేష్‌ ఖాన్‌, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌, సంజూ శాంసన్‌ నేరుగా ఐర్లాండ్‌కు చేరుకోనున్నారు.

భారత జట్టు: జస్ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోరు , ప్రసిద్‌ కష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌.

Latest News

More Articles