Saturday, April 27, 2024

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌

spot_img

హైద‌రాబాద్‌: గ్రామ పంచాయ‌తీల‌కు గ‌త కొంత కాలంగా నిలిచిపోయిన పాత బ‌కాయీలు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు నిన్న ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో భేటీ కాగా, ఈ రోజు ఇద్ద‌రు మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీలలో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిలిచిపోయిన‌ బ‌కాయీలపై చ‌ర్చించారు. రూ.1190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ఆ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు.

కాగా, ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌త కొంత కాలంగా బ‌కాయీలు నిలిచిపోవ‌డంతో స‌ర్పంచులు చేప‌ట్టిన ప‌నుల పురోగ‌తి మంద‌గించింది. దీంతో కొన్ని ప‌నులు మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. కొత్త‌గా ప‌నులు చేప‌ట్ట‌డానికి స‌ర్పంచ్ లు ఇబ్బందులు ప‌డ్డారు. ఈ నిధులు విడుద‌ల కావ‌డంతో అభివృద్ధి ప‌నులు మ‌రింత వేగంగా జ‌ర‌గున్నాయి.

ఇదిలావుండ‌గా స‌ర్పంచ్ ల సంఘం ప్ర‌తినిధులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెక‌ల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో క‌లిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ నిధుల విడుద‌ల‌తో స‌ర్పంచ్ లలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని చెప్పారు. సిఎం కెసిఆర్ తోపాటు, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Latest News

More Articles