Sunday, April 28, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కారులోనే కాలిపోయిన తెలంగాణ విద్యార్థి

spot_img

అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం చెందాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల-సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్‌(21) బీటెక్‌ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది సెప్టెంబర్‎లో న్యూజెర్సీకి వెళ్లాడు. శనివారం అతడు కారులో వెళ్తుండగా.. సెల్టన్‌ కూడలి వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దాంతో శైలేష్‌ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పేలి మంటలు చెలరేగడంతో అతడు మంటల్లోనే సజీవ దహనమయ్యాడు. ఈ సమాచారాన్ని న్యూజెర్సీ అధికారులు మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శైలేష్‌ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విన్నవించారు.

Latest News

More Articles