ఇంటర్ బోర్డు నిబందనల ప్రకారం నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని తెలిపింది. దీంతో ఇప్పటి విద్యార్థులు చాలాఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్ధులు పరీక్షలు కూడా రాయకుండానే వెనుదిరిగారు. ఆదిలాబాద్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిమిషం ఆలస్యాన్ని ఎత్తివేసింది. అంతేకాదు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా..అనుమతించాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది. దీంతో ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించాలని ఇంటర్ విద్యాబోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు.!