Monday, May 6, 2024

జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదేనట..!

spot_img

అయోధ్యారాముడు కొలువుదీరాడు. కొత్త నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఘట్టం కన్నుల పండువగా జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు పలు ఇండస్ట్రీల ప్రముఖులు పెద్దెత్తున తరలివచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తోపాటు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు. దీంతో అభిమానులకు నిరాశ మిగిలింది. ఫిలింనగర్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రాణప్రతిష్టకు రావాల్సిందిగా ఆహ్వానం అందినవారిలో తొలి సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్ అట. కానీ ఆయన మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీనికి కారణంగా దేవర షూటింగ్ అని టాలీవుడ్ లో వార్త హల్ చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: దీపకాంతుల్లో వెలిగిపోయిన రామమందిరం..వైరల్ వీడియో..!!

దేవరలో సైఫ్ అలీఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉండటంతో నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని తారక్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం, ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడం చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తారక్ మాత్రం స్పందించలేదు.

Latest News

More Articles