తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 30వ తేదీన అలాగే మే నెల 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నారు. ఈనెల 30వ తేదీన ఆందోల్లో మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో మోదీ సమావేశం కానున్నారు. మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో మోదీ సభ జరగనుంది. భువనగిరి, నల్లగొండ స్థానాలకు కలిపి మరో సభను నిర్వహించనున్నారు. మే 4వ తేదీన నారాయణపేట, వికారాబాద్ లో ప్రధాని మోదీ సభలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల