Thursday, May 2, 2024

బస్సు బోల్తా.. ఇద్దరు ప్రయాణికులు మృతి

spot_img

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్హాని ఘాట్ ప్రాంతంలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఐదుగురు మైనర్లతో సహా 13 మంది మరణించారు. 29 మందికి పైగా గాయపడ్డారు.

Latest News

More Articles