Monday, May 6, 2024

మెట్రో నిండా మగాళ్లే.. ఊహించని పరిస్థితి

spot_img

తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది. దీనికి తోడు రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు మహిళలు ఆర్టీసీ ప్రీ జర్నీని వాడుకుంటున్నారు.

ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, ఆ ఎఫెక్ట్ కొంత మెట్రో రైళ్లపై కనిపిస్తోంది. లాంగ్ జర్నీ చేసే వాళ్లు తప్ప ఎక్కువ మంది ఆర్టీసీ ఫ్రీ సర్వీస్‌లను వాడుకుంటున్నారు. హైద్రాబాద్ మహానగరంలో పబ్లిక్ నుండి మంచి ఆదరణ పొందుతున్న మెట్రో రైల్‌పై ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం కనిపిస్తోంది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రం మెట్రో లు ఫుల్ అవుతున్నాయి.

గతంలో రోజూ 5 లక్షల వరకు మెట్రో రైడర్ షిప్ నమోదయ్యేది. అయితే, ఆర్టీసీలో మహిళలకు ఉచితం ఇవ్వడంతో కొంత వుమెన్ క్రౌడ్ మెట్రో కంటే ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 12 వందల నుండి 15 వందల వకు సేవ్ అవుతుందంటున్నారు. మరికొందరు మెట్రో స్టేషన్స్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వినియోగించుకుంటూనే, రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే గతం కంటే కొంత లేడీస్ రష్ తగ్గిందని, కూర్చోవడానికి మెట్రోలో సీట్లు దొరుకుతున్నాయంటున్నారు ఇతర ప్రయాణికులు.

Latest News

More Articles